30.2 C
Hyderabad
Friday, June 27, 2025
spot_img

టీడీపీలోకి నెల్లూరు జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు!

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోనే సింహపురి రాజకీయాలు వేరుగా ఉంటాయి. అక్కడ ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉంది. మరోసారి జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిస్థితులు అధికార పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆయనతో మంతనాలు జరిపారు. పార్టీలోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బాబు వద్ద ప్రస్తావించారట. ఈ నెల 13న నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అప్పటిలోగా వీరు పసుపు కండువా కప్పుకునేలా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్