తెలంగాణ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇక నుంచి ఎవరైనా ప్రధాని మోదీని కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణను రికార్డ్ చేసుకుంటే మంచిదన్నారు. ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదని, ఆ కూటమి నుంచే పార్టీలు బయటకు వచ్చాయన్నారు.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీల పైకి ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారిపై ఏమైనా కేసులు ఉంటే వెనక్కి పడిపోతున్నాయన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జూమ్లా పార్టీ అని విమర్శించారు. ఎన్డీయే మునిగిపోయే నావ అని, అలాంటి దానిని ఎక్కాలని ఎవరూ అనుకోరన్నారు.