ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కు ఆకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీపై అంత ప్రేమ ఎందుకో? తెలంగాణ వాళ్లతో ఈ కొత్త బంధం ఏంటో? అని ప్రశ్నించారు. మంత్రులు తెలంగాణ ప్రజలను ఎక్కడా విమర్శించలేదని స్పష్టం చేశారు. కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు హరీశ్ రావు ఏపీ గురించి ఏ వ్యాఖ్యలు చేశారో పవన్ కు తెలుసా? తెలుసుకోకుండా తమపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యాపారాల కోసమే తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని.. అందుకే వారిపై ఈగ వాలనివ్వడం లేదని పేర్ని ఎద్దేవా చేశారు.