ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కు ఆకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీపై అంత ప్రేమ ఎందుకో? తెలంగాణ వాళ్లతో ఈ కొత్త బంధం ఏంటో? అని ప్రశ్నించారు. మంత్రులు తెలంగాణ ప్రజలను ఎక్కడా విమర్శించలేదని స్పష్టం చేశారు. కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు హరీశ్ రావు ఏపీ గురించి ఏ వ్యాఖ్యలు చేశారో పవన్ కు తెలుసా? తెలుసుకోకుండా తమపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యాపారాల కోసమే తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని.. అందుకే వారిపై ఈగ వాలనివ్వడం లేదని పేర్ని ఎద్దేవా చేశారు.
తెలంగాణ వాళ్లతో కొత్త బంధంపై పవన్ సమాధానం చెప్పాలి: పేర్ని
0
464
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


