రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పని చేశారని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం లో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవం గా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు మూడు పార్టీల నేతలకు ధన్యవాదా లు తెలిపారు.రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు.