24.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ఉగ్రవాద చర్యే- ఎస్‌. జైశంకర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు చేస్తోంటే.. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్​ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇరు దేశాల యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధంపై భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7వ తేదీన జరిగిన దాడులు ఉగ్రవాద చర్యేనని జైశంకర్ తెలిపారు. ఇలాంటి ఉగ్ర చర్య ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జైశంకర్.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం గురించి ప్రస్తావించారు.

అక్టోబర్‌ 7న జరిగింది ఉగ్రవాద చర్యేనని.. అందువల్లే ఇజ్రాయెల్‌-గాజాలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతోన్న ఈ ఘర్షణలు త్గగి.. మళ్లీ స్థిరత్వం ఏర్పడుతుందనే నమ్మకంతో అందరూ ఉండాలని సూచించారు. ఈ ఇరు దేశాల మధ్య సమస్య ఒక ఉగ్రవాదమే అయితే అందరం కలిసికట్టుగా దానికి వ్యతిరేకంగా పోరాడలని అన్నారు. కానీ ఇక్కడ పాలస్తీనాకు సంబంధించిన అంశం ఉందని.. మొదటగా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ సమస్యకు చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారం అన్వేషించాలని సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్