బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీస్ ఇచ్చారు. ఈనెల 27న పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా, అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని, సమయం కావాలని హేమ గడువు కోరారు. దీంతో జూన్ 1న తమ ముందు హాజరుకావాలని హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకాణి స్టిక్కర్ ఉన్న కారు యజమానికి నోటీసులు ఇచ్చారు.


