స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీశైలం మల్లన్న భక్తుల కోసం వడ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది శ్రీశైలం దేవస్థానం. ఇప్పటివరకు పులిహోర, లడ్డు మాత్రమే భక్తులకి అందుబాటులో ఉండగా.. నేటి నుంచి వడ ప్రసాదం కూడా భక్తులకి అందుబాటులో ఉండనుంది. 45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు దేవస్థానం విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు పూజాదికాలు చేసి వడ ప్రసాదం శ్రీశైలం ఈవో లవన్న ప్రారంభించారు. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ప్రసాద కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఈవో లవన్న తెలిపారు.