కరోనా(Corona) మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తోంది. రోజువారీ కేసులు 10వేలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ కరోనా కేసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెల రెండో వారం నుంచి రోజువారీ కేసులు 50వేల నుంచి 60వేల మధ్యలో నమోదు కావొచ్చని తెలిపారు. దేశంలో ఐదు శాతం మందికి సహజ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయిందని.. దీంతో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశలున్నాయని చెప్పారు.
Corona |అయితే 130కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో రోజుకు 60వేల కేసులు పెద్ద విషయం కాదన్నారు. ఇప్పటికే నమోదవుతున్న చాలా కరోనా కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని.. దీంతో కరోనాను కూడా ఓ సాధారణ ఫ్లూగానే చూడాలని వెల్లడించారు. కానీ కరోనా కొత్త వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ హెచ్చరించారు.
Read Also: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Follow us on: Youtube, Koo, Google News