స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనపై బీజేపీ అధిష్టానం “విశేష్ సంపర్క్” ర్యాలీలు నిర్వహించనుంది. మోడీ ప్రభుత్వం విజయాలపై ఓ నెల పాటు విస్తృత ప్రచారం చేయాలని తలపెట్టింది. మే 30, 31 రెండు రోజుల పాటు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. తెలంగాణతో సహా, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని పాల్గొనే అవకాశంఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.