Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మోదీ మరో అస్త్రం …. కచ్చతీవు ద్వీపం

లోక్ సభ ఎన్నికల వేళ … శ్రీలంక సమీపంలోని కచ్చతీవు దీవిపై కొత్తవివాదానికి తెరలేపారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత – శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు.. అప్పటి సిలోన్ కు అప్పగించారు. ఆ ఒప్పం దాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం నడుస్తోంది. ఆ ఒప్పందంపై ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్, కాంగ్రెస్, డిఎంకెలపై విమర్శనాస్త్రాలు సంధించడంతో వివాదాస్పదమైంది. ఒకప్పుడు చిన్న చర్చ్ తప్ప మరేమీలేని దీవి.. ప్రస్తుతం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది.

కచ్చతీవు భారత-శ్రీలంక సరిహద్దు జలాల్లో ఉన్న 285 ఎకరాల చిన్న దీవి. రెండు దేశాల మధ్య సము ద్రాన్ని మూడు సెక్టార్లు గా విభజిస్తారు. అందులో భారత్ లోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ ,ఆడమ్స్ బ్రిడ్జి వరకూ ఉండే సెక్టార్ ను పాక్ జలసంధి అంటారు. కచ్చతీవు అందులోనే ఉంది. రామేశ్వ రానికి 11 నాటికల్ మైళ్లు, తలైమన్నార్ కు 18 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఒకప్పుడు భారత్, శ్రీలంక బ్రిటీష్ రాణి పాలన కిందే ఉండేవి. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి ఆ దీవి తమదేనని శ్రీలంక క్లైమ్ చేస్తూ వచ్చింది. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శ్రీలంకకు అప్పగించారు. అంతకుముందు రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణాని ధిని కూడా సంప్రదించిన తర్వాత ఒప్పందం జరిగింది. ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ ను, ఇటు తమిళనాడులోని డిఎంకెను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ కచ్చతీవు దీవి వివాదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. మోదీ సర్కార్ పై నిరుడు అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగానే కచ్చతీవు ప్రస్తావన తెచ్చారు. మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించి 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా కచ్చతీవును శ్రీలంకకు ధారాద త్తం చేసిందని దుమ్మత్తిపోశారు. ఈ ఒప్పందంద్వారా దేశసమగ్రత, దేశప్రయోజనాలను దేశ సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ చట్టం కింద ఎంక్వయిరీ చేయడంతో 1974 ఒప్పందం ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు ఎలా అప్పగించిం దన్న వార్తా కథనాలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ.. ఆ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. అలాగే , అప్పట్లో తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డిఎంకే పార్టీ కానీ, కరుణానిధి కానీ ఏమీచేయ లేదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కచ్చతీవు పై వెలువడుతున్న కొత్త వివరాలు డిఎంకె ద్వంద్వ ప్రమాణా లను పూర్తిగా బయటపెట్టాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు వారు తమ సొంత కుమా రులు, కుమార్తెలు బాగుకోసం శ్రద్ధ వహిస్తారు తప్ప ఎవరినీ పట్టించుకోరని ఆరోపించారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్య వైఖరి మన మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీసిందంటూ ప్రధాని ఫైర్‌ అయ్యారు.

   ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చెలరేగిన దుమారం, బీజేపీ సింహభాగం నిధులు పొందిందన్న అంశం లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన వివాదం కాకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో కచ్చతీవు వివాదం ఒకటి. ఒకపక్క ఢిల్లీసీఎం, జార్ఖండ్ సీఎం ల అరెస్ట్ లు, కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజే యడం వంటి చర్యల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివాదాన్ని ప్రజలు మరచి పోయేలా కృషిచేస్తున్నారు. తమిళనాడులో బీజేపీకి సొంత బలం లేదు. అక్కడి డిఎంకె, కాంగ్రెస్ కూటమి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్, డిఎంకేలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్పుడు కచ్చతీవు ఇండియా వద్దే ఉందని కానీ కాంగ్రెస్‌ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో దశాబ్దాల క్రితం శ్రీలంకకు అప్పగిస్తే ఆ దీవులను తిరిగి స్వాధీనం చేసుకు నేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని మల్లికార్జున్‌ ఖర్గే నిలదీశారు. ఎన్నికల ముందు సున్నితమైన అంశాలను లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

భారత సముద్ర జలాలకు సమీపంలో ఉన్న కచ్చతీవు వద్ద మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. భారత మత్స్యకా రులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్ననెపంతో భారత మత్స్యకా రులపై దాడులు చేయడంతోపాటు అరెస్టులు చేస్తోంది. 1974 నాటి ఒప్పందం ప్రకారం కచ్చతీవు లో భారతీయ జాలర్లు వేటాడవచ్చు, వలలు ఎండబెట్టుకోవచ్చు. కానీ ఎల్టీటీ ఈ సమస్య తర్వాత శ్రీలంక ప్రభుత్వం కచ్చతీవుపై పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో తమిళ జాలర్లు అటు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ కచ్చతీవు శ్రీలంక నుంచి తిరిగి స్వా ధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతుందా.. లేక కేవలం ఎన్నికల వివాదం ఎన్నికలతోనే ముగిసి పోతుందా చూడాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్