17.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో.. రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం పదకొండున్నరకి నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్