32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా భారీ వర్షం ఏకధాటిగా కురుస్తోంది. దీంతో మహబూబాబాద్‌ జిల్లా చిగురాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షంతో సీతారాంతండాకు వరద నీరు పోటెత్తింది. వరదలో జీపు చిక్కుకుపోవడంతో.. అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఆ తర్వాత వరదలో ఖాళీ అయిన జీపు వరదలో కొట్టుకుపోయింది.

భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండలతోగు, జనగాలంచ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును, మేడారం జంపన్న వాగు ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..స్వీయ రక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని.. వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ఆఫీసర్లకు సహకరించాలని సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్