స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాలుర మిస్సింగ్ కేసును ఛేదించారు. మహబూబాబాద్లో శనివారం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు. దీంతో భయబ్రాంతులకు గురైన పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దర్యాప్తును ముమ్మరంమ్ చేసిన పోలీసులు.. 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. 6 గంటల్లోపే పిల్లల ఆచూకీని ఖమ్మంలో కనిపెట్టారు. అనంతరం తల్లిదండ్రులకు పిల్లలను అప్పరించారు. తమ గోడు చెప్పగానేతక్షణమే స్పందించిన పోలీసులకు ఆ పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు.. పోలీసులసేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు.