24 C
Hyderabad
Tuesday, August 26, 2025
spot_img

వివేకా కేసు సాక్షి రంగన్న మృతిపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ

వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై నిన్నటి ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగిందట. అమరావతిలోని సచివాలంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారట. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం అనుమానాస్పదంగానే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని కూడా ఆయన అన్నారు.

వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న రెండు వారాల కిందట కిందపడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, ఆయనకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ రంగన్నను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. వాచ్ మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక, ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయని చెప్పారు. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని.. సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ కేసులో వైఎస్సార్‌ జిల్లా కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019లో చనిపోగా, కీలక వాంగ్మూలం ఇచ్చిన కల్లూరి గంగాధరరెడ్డి 2022లో చనిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ నారాయణ అనే సాక్షి కూడా చనిపోయాడు. గతేడాది సెప్టెంబర్‌లో జగన్‌ బంధువు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి మరణించారు. ఈయన కూడా వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. ఇక తాజాగా ప్రధాన సాక్షి అయిన వాచ్‌ మెన్‌ రంగయ్య మృతి చెందడంతో ఇప్పటివరకు ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు మరణించినట్టైంది. అందరూ అనారోగ్య కారణాలతోనే చనిపోయారు.

ఇదిలా ఉండగా.. కేబినెట్ భేటీలో రంగన్న మృతిని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించడంతో ప్రాధాన్యం ఏర్పడింది . అంతేకాకుండా రంగన్నను పోలీసులే చంపేశారని తాము తొలుత అనుకున్నామని కూడా చంద్రబాబు అన్నారట. దీంతో అక్కడే ఉన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రంగన్న మృతిపై సమగ్ర వివరాలను మంత్రుల ముందు పెట్టారట. చంద్రబాబు అనుమానించినట్లే రంగన్న మృతి అనుమానాస్పదంగానే ఉన్నట్లు తమ విచారణలోనూ తేలిందని కూడా డీజీపీ చెప్పారట. వివేకా హత్య కేసులో ఇలా వరుసగా సాక్షులు చనిపోతే కేసు ఎలా నిలబడుతుంది? అని చంద్రబాబు ఆశ్చర్యంగా అన్నారట. దీన్ని బట్టి మరణాల వెనుక మిస్టరీ ఉందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్