24.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

లోక్ సభ నాల్గో విడత ఎన్నికలకు రెడీ

  2024 లోకసభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు 9 రాష్ట్రాలు ఒక కేంద్రపా లిత ప్రాంతంలోని 96 లోక్ సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న నాల్గో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్షం నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా, గిరిరాజ్ సింగ్, సినీనటుడు శతృఘ్న్ సిన్హా.. వంటి హేమా హేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది.

   దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఎంపీ స్థానాలతో సభ 96 లోక్ సభ స్థానాలకు, ఏపీ అసెంబ్లీ లోని 175 నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. నాల్గో విడతలో తెలంగాణ లో 17, ఆంధ్రప్రదేశ్ లో 25 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్ లోని 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్ లో 8, మధ్యప్రదేశ్ లో 8, బీహార్ లో 5, జార్ఖండ్, ఒడిశాలో నాలుగేసి స్థానాలకు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి.

  మే 13న నాల్గో విడత లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు గోదాలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లోని కన్నోజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ లోని బహరమ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖక్రికెటర్ యూసుఫ్ పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి చౌదరీని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సికింద్రబాద్ నియోజకవర్గం నుంచి, గిరిరాజ్ సింగ్ బీహార్ లోని బెగుసరాయ్ నుంచి, అర్జున్ ముండా జార్ఖండ్ లోని ఖూంటీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. మే 13న నాల్గో విడత ఎన్నికలు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో బెంగాల్ అసన్ సోల్ నుంచి శతృఘ్న్ సిన్హా, బెంగాల్ లోని కృష్ణనగర్ నుంచి మహువా మొయిత్రా, కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిసోదరి వైఎస్ షర్మిళ కరీంనగర్ నుంచి బండి సంజయ్ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట వంటిది. అఖిలేశ్ ఎంపీగా అక్కడి నుంచే రాజకీయ రంగప్రవేశం చేశారు. 2000, 2004, 2009లో అఖిలేశ్ కన్నౌజ్ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిం చారు. అఖిలేశ్ యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012లో ఆ స్థానం నుంచి అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి 2014 లో నెగ్గిన డింపుల్ యాదవ్ 2019లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీలోని మైన్ పురి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, 2024 లో మళ్లీ లోక్ సభ కు పోటీ చేయాలని అఖిలేశ్ చివరి క్షణంలో నిర్ణయించుకు న్నారు. మొదట కన్నౌజ్ స్థానంలో లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటిం చిన అఖిలేశ్ యాదవ్.. తర్వాత తానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది.

నాల్గో విడతలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ లో మొక్కం 1717 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు 454 మంది, తెలంగాణ లోని 17 స్థానాలకు 525 మంది పోటీలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను, పోలీసులను తరలిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం ఇప్పటికే పతాక స్థాయిలో కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం హోరెత్తిస్తుంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జెపినడ్డా, ఇండియా కూటమి పక్షాల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకవద్రా, ఇతరులు ప్రచారం చేస్తున్నారు. మండు టెండల్లో నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల్లో మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత లో జరుగుతాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్