తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేశారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంత మందికి రుణమాఫీ చేశారనంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను గంగలో కలిపి,… ఢిల్లీ ఎన్నికల్లో మళ్లీ గ్యారెంటీలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్
0
154
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


