స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.
హన్మకొండ ప్రధాని సభలో మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు శంఖుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసారు. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు బహిష్కరిస్తున్నారా? ఆయన అడిగాడు. ఈ రాష్ట్రంలో ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి.. హామీలను తుంగలో తొక్కిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్ను బహిష్కరిస్తారు. రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్ను బహిష్కరిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్హౌస్కు పరిమితం చేసే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేశామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్ను కేటాయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణకు 2,500 కి.మీ ఉంటే ఇప్పుడు 5 వేల కి.మీలకు చేరుకుందన్నారు. 150 ఎకరాల్లో రైలు తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 7 వ్యాగన్ల ఉత్పత్తి సామర్థ్యానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.