తెలంగాణసీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లానున్నారు. జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ త్వరలో జిల్లాల్లో పర్యటించను న్నారని సమాచారం. ఒక్కో జిల్లాలో ఒకటి లేదా రెండు రోజులపాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ లేదా 18వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం.