స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్పై(CM KCR) తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ బెడ్ రూమ్(double bedroom) ఇళ్ల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా టీ బీజేపీ(BJP) మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కుల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి దించారు.
ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మోసం చేయడం, గొంతు కోయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేసీఆర్కు లేదు. దోపిడీ డబ్బుతో కేసీఆరే ఫార్మ్ హౌస్లు కట్టుకుంటున్నారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. తెలంగాణలో నిజాం నవాబుల పాలన, అబద్దాల పాలన కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మోసం చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.