కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహాలింగి వాసులు. ఈ మేరకు భైంసా ఆబ్కారీ కార్యా లయంలో సీఐ నజీర్కు వినతిపత్రం అందజేశారు. కల్లు తయారీలో ప్రమాదకర రసాయనాలను కలుపు తూ జనాల ప్రాణాల మీదకు తెస్తున్నారని, రైతులు యువకులు మత్తుకు బానిసయ్యేలా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు. కల్తీ కల్ల తాగి అనారోగ్యం బారిన పడటమే కాక 100 మందికిపైగా జనం మరణిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇకనైనా కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు.


