లోక్సభ ఎన్నికల ముందు.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారుతున్నారు. కేకే, కడియం కుటుం బాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతు న్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న కడియం శ్రీహరిని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, రోహిత్ చౌదరీ, విష్ణు దాస్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి కడియంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ నేతల ఆహ్వానంపై మాజీ మంత్రి కడియం సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని తనను కోరారని కడియం శ్రీహరి తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని చెప్పారు. కాంగ్రెస్లో చేరే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు. అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతోందని కడియం శ్రీహరి చెప్పారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిం చారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయ కుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరి స్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తానుపోటీ నుంచి విరమించు కోవాలని నిర్ణయించుకున్నానని.. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు.