బీఆర్ఎస్ హయంలో జరిగిన అవినీతి బయట పడుతుందని నర్సింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలే దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడీ షియల్ కమిషన్ వేసిందని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కూతురు కవితను కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎ స్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న రామ్మెహన్ రావు అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు.