తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజూ జూడాలు నిరసన చేపట్టారు. ఎమ్మెర్జెన్సీ సేవలు మినహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి జూడాలు సమ్మెకు దిగారు. నిన్న మంత్రి దామోదర రాజ నర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. అయితే చర్చ లు విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఇవాళ మరోసారి ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచే అవకాశం ఉంది.గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ ఇవ్వాలని, ఆస్పత్రుల్లో డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకో వాలని జూడాలు కోరుతున్నారు. ఉస్మానియాకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ వైద్య కాళాశాలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. వైద్య కళాశాలల్లో జూడాలకు కనీస సదుపాయాలు లేవంటున్నారు. నిన్న సచివాల యంలో మంత్రితో జూడాల ప్రతినిధులు సమావేశమై తమ డిమాండ్లను ఆయన ముందుం చారు. వాటిపై వివిధ విభాగాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. దీంతో చర్చలు అసంపూర్తి గా ముగిశాయి.