24.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

సీమను తెలంగాణలో కలపాలని జేసీ సంచలన వ్యాఖ్యలు

రాయలసీమను తెలంగాణలో కలపాలని మాజీ మంత్రి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కలిపితేనే రాయలసీమ నీటి సమస్య తీరుతుందని తెలిపారు. రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత నేతలందరిని కలుస్తానని తెలిపారు జేసీ. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమన్నారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కాగా గతంలో రాష్ట్ర విభజన సమయంలోనూ రాయల తెలంగాణ అనే డిమాండ్స్ వచ్చాయి. కొంతమంది సీమ కాంగ్రెస్ నేతలు దీనిపై పోరాటం కూడా చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాయల తెలంగాణ అంశం జేసీ తెరపైకి తీసుకురావడం సంచలనంగా మారింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్