జపాన్(Japan)లో మరోసారి ప్రధానిమంత్రే టార్గెట్ గా దుండగులు రెచ్చిపోయారు. అదృష్టవశాత్తూ ప్రధాని ఫుమియో కిషిడా(Fumio Kishida) పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామా ఉపఎన్నికల ప్రచార సభలో కిషిడా(Kishida) ప్రసగింస్తుండగా ఓ దుండగుడు పైప్ బాంబును ఆయన మీదకి విసిరాడు. అయితే అది ప్రధానికి కొద్ది దూరంలోనే భారీ శబ్దంతో పేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతేడాది ఓ పబ్లిక్ మీటింగ్ లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అప్పటి ప్రధాని షింజో అబే(Shinzo Abe) కన్నుమూసిన సంతగి తెలిసిందే.