ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓ వైపు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్న టీడీపీ, జనసేన ఇప్పటికే మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. సెకండ్ లిస్ట్పై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. అభ్యర్థుల రెండో జాబితాపై చర్చించారు. బీజేపీతో పొత్తుపై కూడా చర్చిం చారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.