నేడు గుంటూరు, కడప జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి.. గుంటూరు యువకుడి దాడిలో మృతి చెందిన యువతి సహానా కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి బద్వేలుకు చేరుకుని ప్రేమోన్మాది దాడిలో మరణించిన దస్తగిరమ్మ కుటుంబానికి పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్.. రాత్రికి అక్కడే బస చేస్తారు. కూటమి సర్కార్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఈక్రమంలోనే అత్యాచారం, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు జగన్.


