21.1 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త..నేడు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. సొంతింటి పండుగను ఏపీ ప్రజలకు అందించనున్నారు సీఎం జగన్‌. ఇవాళ ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు. ఈ లెక్కన ప్రతి మహిళ చేతికి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తి అందించనున్నారన్న మాట. ఇక ఇవాళ సామర్లకోటలో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం ఉండనుంది. అక్కడ 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి. స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్…ఒకేరోజు ఏపీ వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు. కాగా, మొన్న పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు వైయస్‌.జగన్‌. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించారు వైస్‌.జగన్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్