స్వతంత్ర వెబ్ డెస్క్: జగన్కు దోపిడీపై ఉన్న శ్రద్ధ.. రైతుల సమస్యలపై ఉండదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. పల్నాడు జిల్లా గురజాల (Gurajala) నియోజకవర్గంలో జూలకల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా జూలకల్లు గ్రామస్థులను లోకేశ్ కలిసి మాట్లాడారు. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేని దిక్కుమాలిన ప్రభుత్వమిదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వలను ఆధునికీకరిస్తాం.. చివరి భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
జూలకల్లులో సాగర్ కుడి కాల్వ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ (Selfie Challenge) విసిరారు. ‘‘నిర్వహణ లేక గేట్లు శిథిలావస్థకు చేరి.. నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. పులకేసి పాలనలో రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో అని లోకేశ్ ఎద్దేవా చేసారు.