వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజవకర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్వీకరించారు. తెల్లవారు జాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు, వినతులను జగన్ స్వీకరించారు.


