23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

ఉత్తరప్రదేశ్ విధానసభలో పాన్ మసాలా మరకలు

చట్టాలు చేయాల్సిన చోటను యూపీ ఎమ్మెల్యేలు అపవిత్రం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలే సాక్షాత్తు దేవాలయం లాంటి శాసనసభలో పాన్ మసాలా తినడమే కాకుండా…. తలుపుల సందుల్లో దాన్ని ఉమ్మివేశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీలో జరిగింది.

ఘటనపై యూపీ స్పీకర్ సతీశ్ మహానా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆ మరకలను పరిశీలించిన స్పీకర్… ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని ఇతర ఎమ్మెల్యేలను కోరారు. తాను సీసీ ఫుటేజీలో చూశానని… ఎవరినీ కించపరచడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరి పేరునూ తాను తీసుకోవడం లేదని… వారు ఈ పని చేయడం మానేయాలని సూచించారు. ఎవరైనా అలాంటి పనిచేస్తే ఆ చర్యను మిగతా ఎమ్మెల్యేలు అడ్డుకోవాలన్నారు.

“ఈ ఉదయం, మన విధాన సభలోని ఈ హాలులో కొంతమంది సభ్యులు పాన్ మసాలా తిన్న తర్వాత ఉమ్మివేసినట్లు నాకు సమాచారం అందింది. కాబట్టి, నేను ఇక్కడికి వచ్చి శుభ్రం చేయించారు. వీడియోలో ఎమ్మెల్యేను చూశాను. కానీ నేను ఎవరినీ అవమానించాలనుకోవడం లేదు. కాబట్టి, నేను వారి పేరును ఉపయోగించడం లేదు. ఎవరైనా ఇలా చేయడం చూస్తే, వారిని ఆపాలని నేను సభ్యులందరినీ కోరుతున్నాను… ఈ అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత… సంబంధిత ఎమ్మెల్యే వచ్చి వారు ఇలా చేశారని నాకు చెబితే మంచిది. లేకుంటే, నేను వారికి ఫోన్ చేస్తాను” అని ఆయన అన్నారు.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్