28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

మైలవరంలో ఆసక్తికర రాజకీయాలు

   మైలవరం టీడీపీలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఉప్పు…నిప్పుగా ఉన్న నాయకులు కలిసి పని చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో ఇప్పుడు వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమా…టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు..ఇక నుంచి ఐక్యంగా పని చేయాలనీ నిర్ణయం తీసుకొని, ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయ ప్రదం చేసేందుకు కలిసి పని చేయాలని ప్రకటన చేశారు.

    చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే విధంగా..ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యకర్తలు, నాయకులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు..గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సోమవారం సాయంత్రం జేఎన్ఎన్యూ ఆర్ఎం  కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్య క్రమంలో ఐక్యంగా పాల్గొంటామన్నారు. అయితే వీరి ఇద్దరు కలయిక టీడీపీలో చేరిన.. వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇబ్బందికర పరిస్థితి తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్