కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని… బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణాలో తిరుగుతారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని… లేదంటే తెలంగాణలో తిరగనియ్యమని తెలిపారు.. పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండటం దరదుష్టకరమని .. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


