ఇండియా టీ-20 వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఉంటారు. వెస్టిండీస్, అమెరికాలో ఐసీసీ పురుషుల టీ-20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు కెప్టెన్ – రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూశాంసన్, జట్టులో యశస్వి యాదవ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్ , జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ రిజర్వ్ ఆటగాళ్లుగా శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉంటారు.