30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

త్వరలో చైనా రికార్డు బద్దలుకొట్టనున్న ఇండియా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న చైనాను ఈ ఏడాది మధ్యలో భారత్ దాటనుందని ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ 2023 నివేదికలో ఐక్యారాజ్యసమితి తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 142.85కోట్లు లేదా 142.86కోట్ల జనాభాతో ఇండియా తొలి స్థానం దక్కించుకుంటుందని అంచనా వేసింది. 142.57కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో.. 340మిలియన్ల జనాభాతో అమెరికా మూడవ స్థానంలో ఉంటాయంది.

2023ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ నివేదిక తయారుచేసినట్లు పేర్కొంది. అయితే గత నివేదికలో ఈ నెలలోనే చైనా జనాభాను భారత్ దాటిపోతుందని అంచనా వేయగా.. తాజా రిపోర్టులో మాత్రం ఏ నెలలో దాటుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. 2011తర్వాత ఇండియాలో జనగణన జరగలేదని.. దీంతో ఇప్పుడే చెప్పలేమని చెప్పింది. 1960 తర్వాత చైనాలో జనాభా తగ్గడం ప్రపంచంలో అనేక మార్పులు తీసుకురానుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్