31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

2036 ఒలింపిక్స్‌కు భారత్‌ బిడ్‌: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

  • భారత్‌కు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా తెలుసని వెల్లడి

భారత దేశం క్రీడల పరంగా వెనుకబడి ఉంటుందని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఇక్కడ ప్రోత్సాహం తక్కువ అని చాలామంది చెప్పేమాట.. అటువంటప్పుడు ఇక్కడ క్రీడాకారులకే దిక్కులేక పోతే, క్రీడా పోటీలు నిర్వహణ ఎంతవరకు సాధ్యం అని అంటున్నారు.

కానీ ఇప్పుడు భారత్ దృష్టి ఒలింపిక్స్ మీద పడింది. ఒలింపిక్స్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు సంబంధించి భారత్‌ బిడ్‌ వేస్తుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్‌కు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా తెలుసని ఆయన చెప్పారు. తయారీ, ఇతర రంగాలలో దూసుకుపోతున్న భారత్‌.. క్రీడలలో మాత్రం వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌కు ఇటీవలే జీ-20 సారథ్యం దక్కింది. దీనిని భారత్‌ విజయవంతంగా నిర్వహించగలిగినప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా కష్టమేమీ కాదు. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ)తో కలిసి ఆ దిశగా కృషిచేస్తాం.

వాస్తవానికి ఒలింపిక్స్ వేదికలు చాలా ముందే ఖరారు అయిపోతుంటాయి. ఇప్పటికే 2032 దాకా ఒలింపిక్స్ వేదికలు ఖరారు అయిపోయాయి. అందుచేత 2036 కోసం భారత్ పోటీ పడుతోందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తే భారత్ పేరు మార్మోగి పోవటం ఖాయం.

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్