రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు. ఈ ఫ్లై ఓవర్ కు అనుమతులు తీసుకుని వచ్చింది మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనేనని స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతుందని అన్నారు. కొద్దిరోజులుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చింది తామేనని వైసిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చి మురళీమోహన్ శిలాఫలకం వేస్తే, పనులు ప్రారంభం అని భరత్ మరో శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.