21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

కేసీఆర్ కు పెగ్గుల మీదున్న శ్రద్ధ అభివృద్ధి మీద లేకపోయే.. బండి సంచలన వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వాళ్లెవరూ లేరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖమ్మం సభలో వాడీవేడి ప్రసంగం చేశారు అన్నారు. మోసం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని అన్నారు.

నాడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకపోడంతో ఆయనను ఆకట్టుకునేందుకు కొడుకు అజయ్ రావు పేరును కేటీఆర్ గా మార్చాడని విమర్శించారు.”రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక్కటే లెక్క… ఒక పెగ్ వేస్తాడు… ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేస్తాడు… డబుల్ బెడ్రూం ఇళ్లు అంటాడు, మూడు పెగ్గులు వేస్తాడు… దళితులకు మూడెకరాలు అంటాడు, నాలుగు పెగ్గులు వేస్తాడు… దళిత బంధు అంటాడు, ఐదు పెగ్గులు వేస్తాడు… నేను ఏమీ అనలేదంటాడు. అలాంటి వాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎలా భరిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని? ఈ ముఖ్యమంత్రి పేరు ఎక్కడన్నా చెబితే ఉన్న గౌరవం కూడా పోతుంది.

ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అప్పులు తీరాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలోని బీజేపీ తెలంగాణను ముందుకు తీసుకెళుతుంది. పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోదీ రాజ్యం రావాలి. అందుకోసం కలిసికట్టుగా మందుకు సాగుదాం” అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్