స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ(BJP) బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. బీజేపీ నుంచే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే తన ప్రాణం పోయిన సెక్యులర్ పార్టీలైన(Secular Party)… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చేరనని క్లారిటీ ఇచ్చారు.
అలాగే బీజేపీ అధిష్ఠానం తనపై విధించిన సస్పెన్షన్ను సరైన సమయంలో ఎత్తివేస్తుందని తెలిపారు. ఒక వేళా అలా జరగకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని, అంతేకానీ స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయనని తెలిపారు. తెలంగాణ హిందూ రాష్ట్రం అయ్యేందుకు పని చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని.. వారి నిర్ణయం కోసం బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ పెట్టారని ఆరోపించారు.