హైదరాబాద్ దుండిగల్‌లో దారుణం

ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ.. చివరకు మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దుండిగల్ తండాలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న శాంత తన దుకాణం ప్రక్కన విగతజీవిగా పడిఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. సీసీ పుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు.

దుండిగల్ తండాకు చెందిన శాంతి అదే గ్రామంలో బెల్ట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ ఆమె ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఈ నెల 21న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ..శాంతితో కమల్ కుమార్ గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమె మరణించింది. సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కమల్ కుమార్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్