పసిడి ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024, మార్చిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు రెక్కలొ చ్చాయి. తాజాగా దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై 540 రూపాయలు పెరిగాయి. దీంతో తులం బంగారం ధర రూ.66 వేలు దాటింది.హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేల 750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 270కి చేరు కుంది. కిలో వెండి ధర రూ.79 వేల 100గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పసిడి ధరలు పెరగడం తో సమాన్య జనాలు బంగారం వైపు చూడాలంటనే భయపడిపోతున్నారు.


