Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఇండియా కూటమిలోనే హోరా హోరీ

   పంజాబ్‌లో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడో విడతలో భాగంగా జూన్ ఒకటోతేదీన పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే , ఇండియా కూటముల మధ్య పోటీ జరుగుతుంటే, పంజాబ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఇండియా కూటమిలోనే హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండూ ఇండియా కూటమిలోనే ఉన్నాయి. ఇదొక విశేషం. ఆప్‌, కాంగ్రెస్‌లలో ఎవరు గెలిచినా అది ఇండియా కూటమికే లాభం. కాగా బీజేపీ, అకాలీదళ్‌ కూడా బరిలో ఉన్నాయి.

  పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటికి చివరి విడతలో భాగంగా జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదల్ కీలక పార్టీలుగా ఉన్నాయి. అయితే పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య నే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే కావడం విశేషం. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో మాత్రం ఒంటరి గా బరిలోకి దిగింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.పంజాబ్‌లోని ఒక కీలక నియోజకవర్గం. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం ఉన్న ప్రాంతమే అమృత్‌సర్. వాస్తవానికి అమృత్‌సర్‌ను కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గంగా చెబుతారు. 2014,2019 లలో అమృత్‌సర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుర్జీత్ ఔజాలా పోటీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ధలీవాల్ బరిలో ఉన్నారు. కాగా బీజేపీ తరఫున తరణ్‌జిత్ సింగ్ సంథూ బరిలో ఉన్నారు.

  ఆనంద్‌పూర్ సాహిబ్‌ ఇది మరో కీలక నియోజకవర్గం. సిక్కుల పవిత్ర నగరాల్లో ఇదొకటి. ఆనంద్‌పూర్ సాహిబ్‌ నగరం శివాలిక్ పర్వత ప్రాంత సమీపాన ఉంటుంది. ఇక్కడ్నుంచి 2014లో అకాలీదళ్ గెలిచింది. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి అకాలీదళ్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాగా అకాలీదళ్ తరఫున ప్రేమ్‌ సింగ్, కాంగ్రెస్ తరఫున విజయ్ ఇందర్ సింగ్లా పోటీలో ఉన్నారు. బఠిండా అకాలీదళ్‌ కు ఈ నియోజకవర్గం కంచుకోట. బఠిండాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. అలాగే సైనిక కంటోన్మెంట్ కూడా ఉంది. 2014, 2019 లలో బఠిండా నియోజకవర్గం నుంచి అకాలీదళ్ విజయం సాధించింది. అకాలీదళ్ తరఫున హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఈసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్దు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై గుర్మిత్ సింగ్ బరిలో ఉన్నారు.

   గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఫరీద్‌కోట్‌. ఒకప్పుడు ఫరీద్‌కోట్‌ సెగ్మెంట్ అకాలీదళ్‌ కు కంచుకోట. అయితే కాలక్రమంలో ఇక్కడ అకాలీదళ్‌ పట్టు కోల్పోయింది. 2019లో ఫరీద్‌కోట్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఫరీద్‌కోట్‌ నుంచి ఈసారి ఇద్దరు కళాకారులు పోటీ పడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై నటుడు, గాయకుడు కరంజీత్ అన్మోల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ లో ఉన్నారు. కాగా ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. వాఘా సరిహద్దు ఇక్కడే ఉంది. ఈ నియోజకవర్గంలో మొదట్నుంచి అకాలీదళ్‌కు మంచి పట్టుంది. 2014,2019 లో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుంచి అకాలీదళ్ విజయం సాధించింది. ఈసారి అకాలీదళ్‌ తరఫున నర్దేవ్ సింగ్ బాబీ పోటీలో ఉన్నారు.

  హోషియార్‌పూర్ మహాభారత కాలానికి సంబంధించిన నగరమని ప్రతీతి. ఈ ప్రాంతాన్ని పాండవుల వారసులు పాలించారని చెబుతారు. 2014 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది. 2019 లో హోషియార్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. బీజేపీ టికెట్‌పై అనితా సోం ప్రకాశ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై యామినీ గోమర్ పోటీలో ఉన్నారు. మొత్తంమీద హోషియార్‌పూర్లో బీజేపీ దూకుడు మీద ఉంది. సంగ్రూర్ నియోజకవర్గాన్ని ఆయుధాల మ్యూజియంగా చెబుతారు. జింద్ రాజుల కాలం నాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్న మ్యూజియం. సంగ్రూర్ నియోజకవర్గ ప్రత్యేకత. 2014 అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయం సాధించారు. దీంతో ఈసారి ఇక్కడ ఆప్‌ను గెలిపించే బాధ్యత భగవంత్ మాన్‌పై పడింది. కాగా కాంగ్రెస్ నుంచి సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, బీజేపీ టికెట్‌పై అరవింద్ ఖన్నా, అకాలీదళ్ అభ్యర్థిగా ఇక్బాల్ సింగ్ పోటీలో ఉన్నారు. ఫతేగఢ్ సాహిబ్‌ను గురుద్వారాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. ఫతేగఢ్ సాహిబ్‌ ను హస్తం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 2019లో ఫతేగఢ్ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ తరఫున అమర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై గురుప్రీత్‌ సింగ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. జలంధర్‌ దేశవ్యాప్తంగా పేరున్న నియోజకవర్గం. క్రీడా సామగ్రి తయారీకి జలంధర్ ఫేమస్. పురాణాల్లోని జలంధ రుడి పేరుతో ఈ నియోజకవర్గం ఏర్పాటైందని చెబుతారు. 2014 అలాగే 2019 ల్లో జలంధర్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జలంధర్‌ నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్‌. కాగా హస్తం పార్టీ తరఫున చరణ్‌ జిత్ సింగ్ చన్నీ, ఆప్ అభ్యర్థిగా పవన్ కుమార్ బరిలో ఉన్నారు.

ఖదూర్ సాహిబ్ నియోజకవర్గానికి సిక్కు సామాజికవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎనిమిది మంది సిక్కు గురువులు సందర్శించిన స్థలంగా ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖదూర్ సాహిబ్ ను పవిత్ర స్థలంగా భావిస్తారు సిక్కు మతస్తులు. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌ నుంచి 2014లో అకాలీదళ్ గెలిచింది. కాగా 2019 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి కుల్బీర్ సింగ్ జీరా, ఆప్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న సిక్కు మత గురువు అమృత్‌పాల్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. దీంతో ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. లూథియానా నియోజకవర్గం. పారిశ్రామిక హబ్‌గా మారింది. గ్రామీణ పంజాబీ సంస్కృతికి కేంద్రస్థానం లూథియానా సెగ్మెంట్. కాగా లూథియానా నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్  విజయం సాధించింది. అలాగే 2019 లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఈసారి కాంగ్రెస్ నుంచి అమరీందర్ సింగ్ రజా వారింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశోక్ ప్రసాద్ పప్పీ బరిలో ఉన్నారు.

పటియాలా పంజాబ్‌లోని మరో కీలక నియోజకవర్గం ఇది. విభిన్న జీవనశైలికి పెట్టింది పేరు పటియాలా. రాజ్‌పుత్‌, మొఘల్, పంజాబీ సంస్కృతులు పటియాలా ప్రాంతంలో కనిపిస్తాయి. పటియాలా నుంచి 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాగా 2019 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి ఆప్‌, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బల్బీర్ సింగ్ పోటీలో ఉండగా కాంగ్రెస్ టికెట్‌లపై ధరంవీర గాంధీ బరిలో నిలిచారు. గతంలో అకాలీదళ్‌, బీజేపీ కలిసి పోటి చేసినప్పుడు ఆ కూటమికి భారీ విజయాలు నమోదయ్యాయి. అయితే వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల మహోద్యమం నేపథ్యంలో బీజేపీతో అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీలు ప్రస్తుతం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా కొన్ని చోట్ల బరిలో ఉంది. అయితే ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడానికే బీఎస్పీ పరిమితం అయ్యేలా ఉంది. కాగా పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పనితీరుకు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు పరీక్షగా మారాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్