స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: వాతావరణం ప్రతికూలించడంతో కేదార్నాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. కేదార్నాథ్ ధామ్ మార్గంలో భారీ హిమపాతం కురుస్తుందనిహెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ వారంలో కేదార్ఘాటిలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.