ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ నిరసనలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొనడంతో వాతావరణం మరింత వేడెక్కింది. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో చంద్రబాబు రోడ్ షో ప్రారంభం కానుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.