22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

తెలంగాణ నుంచి జనం సొంతూళ్లకు పయనమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లా లకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో హైదరాబాద్ లోని పలు బస్టాండ్ లలో ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్తిపోతుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగిం చుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు భారీ సంఖ్యలో ఏపీకి తరలివెళ్తున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలు చోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు అవుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్, పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్