39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధానిలో భారీ భూకంపం సంభవించింది. పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించగా.. జనం ఇళ్ల నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.2గా నమోదు అయింది. భూకంప కేంద్రం నేపాల్ కి సమీపంలో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి స్పష్టం చేసింది.

ఢిల్లీతో సహా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో దాదాపు 40 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2.26 నిమిషాలకు భూమి కంపించినట్టు సమాచారం. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికీ పరుగులు తీశారు. ఢిల్లీలో ఇవాళ రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. తొలుత ఆప్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. రెండోసారి నేపాల్ భూకేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్