ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2020వ సంవత్సరం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎంపికైన వారికి ప్రొబేషన్ ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖలు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రొబేషన్ పొందిన వారికి మే ఒకటి నుంచి కొత్త పే స్కేల్ ఆధారంగా జీతాలు పెరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రొబేషన్ పొందిన వారికి మే ఒకటి నుంచి అందే జీతాలు కింద జీవోలో ఉన్నాయి..