స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఇంటర్ విద్యలో మరో కొత్త మార్పును తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. పదో తరగతి తరహాలోనే ఇంటర్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ ఆలోచనలో పడింది. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు గురికావడం, చదువుతో తీవ్ర ఒత్తిడికి గురికావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడ్స్ తీసురావాలని భావిస్తుంది. అయితే మరి ఈ గ్రేడ్ సిస్టంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అన్న అంశాలపై చర్చిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేనందున గ్రేడ్ సిస్టం గురించి ఆలోచిస్తన్నారు. ఇవే కాకుండా పలు అంశాలపై అధ్యయనం చేసి పూర్తి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని సర్కారు భావిస్తోంది.