దేశంలో బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఒక్కరోజే రూ. 1400 తగ్గి ప్రస్తుతం తులం రూ. 66 వేల 150 కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసడి రేటు రూ. 1530 పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ రూ. 72 వేల 160కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు రూ. 2 వేల 500 పడిపోయి రూ. 83 వేల మార్కుకు దిగొచ్చింది.