Andhra Pradesh | విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని దేవునికనపాకలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మందు గుండు పేలడంతో గోడౌన్ పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపడింది. అటుగా వెళ్తున్న మహిళపై గోడౌన్ రేకు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించడంతో వాచ్ మెన్లు ఆచూకీ లేకుండా పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కాగా, ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


